Breaking News

కరోనా.. అదేతీరు

కరోనా.. అదేతీరు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,676 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ ​కేసులు 41,018 నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 396కు చేరింది. రాష్ట్రంలో 2,22,693 శాంపిళ్లను పరీక్షించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 788, రంగారెడ్డి 224, మేడ్చల్​160, సంగారెడ్డి 57, వరంగల్​అర్బన్​ 47, కరీంనగర్​92, మహబూబాబాద్​19, మెదక్​26, నల్లగొండ 64, నాగర్​కర్నూల్​30, వనపర్తి 51, సూర్యాపేట, నిజామాబాద్​ జిల్లాల్లో 20 చొప్పున కేసులు నమోదయ్యాయి.