![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/CARONA-NEW-CASESSSFF.jpg?fit=729%2C393&ssl=1)
సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,742కరోనా కేసులు నమోదయ్యాయి. 86 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,003 కి చేరింది. మొత్తం 57,685 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 86,725గా ఉంది. ఇప్పటివరకు 2,26,372మంది కరోనా నుంచి కోలుకోగా.. 2,906 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.