Breaking News

ఏపీలో 845 పాజిటివ్​ కేసులు

ఏపీలో 845 పాజిటివ్​ కేసులు

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గడంతో లేదు. గురువారం 14,285 శాంపిళ్లను పరీక్షించగా, 845 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో 812 కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 29 మందికి కోవిడ్​ 19 నిర్ధారణ అయింది. తాజాగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. 281 మంది వివిధ హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. రాష్ట్రంలో మొత్తంగా 9,32,713 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,586 మంది వైరస్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.