సారథిన్యూస్, హైదరాబాద్: ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్యప్రణాళికను తెలంగాణ ఇంటర్బోర్డు మార్చబోతున్నది. ఇందుకోసం నిపుణుల కమిటీని నియమించింది. తెలంగాణ పదాలు, సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది(2020-21) ఫస్టియర్లో చేరబోయే విద్యార్థులకు ఈ కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. 2021-22 విద్యా సంవత్సరానికి ద్వితీయ సంవత్సరంలోనూ కొత్త పాఠ్య ప్రణాళికతో పుస్తకాలు రూపొందుతాయి. తెలంగాణ రచయితలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇంటర్బోర్డు వర్గాలు తెలిపాయి.
- July 23, 2020
- Archive
- తెలంగాణ
- షార్ట్ న్యూస్
- స్టడీ
- GOVERNMENT
- HYDERABAD
- INTER
- TELUGU
- ఇంటర్
- తెలుగు
- Comments Off on ఇంటర్ పాఠ్యాంశాల్లో మార్పు