సారథిన్యూస్, అమరావతి: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది. రిమాండ్లో ఉన్న అచ్చెన్నాయుడుకు కొంత కాలంగా కరోనా, ఇతర అరోగ్యసమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రమేష్ ఆస్పత్రి, ఎన్ఆర్ఐ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందించింది. ఈఎస్ఐ స్కాంలో రూ. 150 కోట్లు అవకతవకలు జరుగడంతో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 12న ఆయన అరెస్టయ్యారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
- August 28, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ANDHRAPRADESH
- BAIL
- ESI SCAM
- HIGHCOURT
- TDP
- అచ్చెంనాయుడు
- టీడీపీ
- బెయిల్
- Comments Off on అచ్చన్నకు బెయిలొచ్చింది