Breaking News

 ఆర్టీసీ బస్సు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్​

ఆర్టీసీ బస్సు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్

సామాజిక సారథి, పటాన్‌చెరు: రన్నింగ్ ఆర్టీసీ బస్సు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్​ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… లింగంపల్లి చౌరస్తా వద్ద ఓ వ్యక్తి ఒక్కసారిగా పటాన్​చెరు వైపు నుండి మెహదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెణక చక్రాల కింద పడుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి చాతి, మెడపై నుండి బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. ఈ దృష్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. కావాలనే ఆ గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.