సామాజిక సారథి, పటాన్చెరు: రన్నింగ్ ఆర్టీసీ బస్సు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… లింగంపల్లి చౌరస్తా వద్ద ఓ వ్యక్తి ఒక్కసారిగా పటాన్చెరు వైపు నుండి మెహదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెణక చక్రాల కింద పడుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి చాతి, మెడపై నుండి బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. ఈ దృష్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. కావాలనే ఆ గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- November 1, 2022
- Archive
- క్రైమ్
- మెదక్
- లోకల్ న్యూస్
- Bus
- medak
- Patan Cheru
- Person
- RTC
- SUICIDE
- Comments Off on ఆర్టీసీ బస్సు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్