Breaking News

అర్ధరాత్రి వరకు బార్లు ఓపెన్‌

అర్ధరాత్రి వరకు బార్లు ఓపెన్‌

సామాజికసారథి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా బార్లు, వైన్‌ షాపులకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. డిసెంబర్‌ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. డిసెంబర్‌ 31న వైన్‌ షాపులు సైతం అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంటాయని చెప్పింది. ఈ మేరకు చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. అయితే కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖకు సూచించారు.