సారథి న్యూస్, నాగార్జునసాగర్ : నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రం క్రస్ట్గేట్లను తాకింది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు వద్ద విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్కు 40,259 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గురువారానికి క్రస్ట్గేట్ల లెవల్ (546 అడుగుల)కు నీటిమట్టం చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 13 రోజులుగా వరద వస్తుండగా, సాగర్ నీటిమట్టం రోజుకు ఒక అడుగు చొప్పున […]