ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా శనివారం అనూహ్య నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నేళ్లూ తనకు అండగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులకు ఎంఎస్ ధోనీ కృతజ్ఞతలు తెలిపాడు. 2004లో టీమిండియా జట్టులోకి అరంగ్రేటం చేశాడు. డిసెంబర్ 23న బంగ్లాదేశ్తో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. 2005, డిసెంబరు 2న శ్రీలంకతో […]