![బాధిత కుటుంబాలకు సీతక్క పరామర్శ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/29HSB7-1.jpg?fit=650%2C320&ssl=1)
సామజిక సారథి, ములుగు: నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలోని మైలారం తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొడ రాములు, అదే విధంగా గాంధీ నగర్ కు చెందిన మల్లెల సమ్మక్క, భూక్యా రుక్మా ఇటీవలే మరణించగా ‘సోమవారం మృతుల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పరమర్శించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు సుంకర బోయిన మొగిలి, జడ్పీటీసీ పూల్సం పుష్పలత శ్రీనివాస్, ఎంపీపీ బానో త్ విజయ రూపు సింగ్, వైస్ ఎంపీపీ కడ బోయిన జంపయ్య, ఎంపీటీసీ లు ఫోరం అధ్యక్షుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.