Breaking News

కులమత భేదాలు లేకుండా కలిసి పోవాలి

కులమత భేదాలు లేకుండా కలిసి పోవాలి

తెలంగాణ రాష్ట్ర డెంటల్ డాక్టర్స్​ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్​కర్నూల్ నియోజకవర్గంలోని ముస్లింలు కులమత భేదాలకు తావులేకుండా అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉండాలని తెలంగాణ రాష్ట్ర డెంటల్ డాక్టర్స్ ​అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి ఆకాంక్షించారు. ఇదే సంస్కృతిని సదా పాటించాలని కోరారు. రంజాన్ మాసంలో ముస్లింలకు ఉపవాస దీక్షలు ప్రత్యేకమైనవని అన్నారు. శనివారం నాగర్​కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో కూచకుళ్ల కొండమ్మ ఫంక్షన్ హాల్ లో ముస్లింలకు ఆయన ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ముస్లిం మత గురువులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్ లో పాల్గొన్నారు. విందులోని ఆహారాన్ని పలువురు మతపెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ​రాజేశ్​రెడ్డి మాట్లాడుతూ.. ఆయన వెంట ఎంపీపీ నరసింహరెడ్డి, ఉప సర్పంచ్ ​కరుణాకర్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాసులు, నాయకులు రేణుబాబు, ముస్లిం సోదరులు జబ్బార్, ఖాజా, రఫీ, మైనోద్దీన్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్​రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇఫ్తార్​ విందులో కూచకుళ్ల డాక్టర్​ రాజేశ్​ రెడ్డి
ఇఫ్తార్​ విందులో పాల్గొన్న ముస్లింలు