సారథి న్యూస్, శ్రీకాకుళం: ఇటీవల సోషల్ మీడియాలో ఎస్సై శిరీష పేరు మార్మోగుతోంది. ఓ అనాథ శవాన్ని మోసుకుపోయిన ఆమెను ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. మానవత్వం చాటిన ఆ మహిళా అధికారిని తాజాగా పోలీసు ఉన్నతాధికారులు సైతం ప్రశంసించి అవార్డు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఎస్సై శిరీష విధులు నిర్వహిస్తున్నారు. పలాస మండలం అడవి కొత్తూరు వద్ద ఈనెల 1న గుర్తుతెలియని శవం ఉందన్న విషయం ఎస్సై శిరీషకు అందింది. దీంతో ఆమె హుటాహుటినా సంఘటన స్థలానికి వెళ్లారు. ఆ శవాన్ని తీసుకెళ్లేందుకు గ్రామస్తులు ఎవరూ ధైర్యం చేయలేదు. దీంతో ఆమె తన భుజాలపై శవాన్ని మోసుకొచ్చారు. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి అంతిమసంస్కారాలు నిర్వహించారు. ఆమెను కృషిని మెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం అవార్డుతో పాటు ప్రశంసాపత్రం అందజేశారు. ఎస్సై శిరీష కృషి పలువురిని స్ఫూర్తికావాలని పిలుపునిచ్చారు.
- February 5, 2021
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- సూపర్కాప్
- AP DGP GOUTHAMSAWANG
- KASIBUGGA
- SI SHIRISHA
- SRIKAKULAM
- ఎస్సై శిరీష
- ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
- కాశీబుగ్గ
- శ్రీకాకుళం
- Comments Off on శభాష్.. ఎస్సై శిరీష