Breaking News

ఆర్ఎఫ్​సీఎల్​ లో ఉద్యోగాలను అమ్ముకుంటున్రు

ఆర్ఎఫ్​సీఎల్​ లో ఉద్యోగాలను అమ్ముకుంటున్రు

సారథి, రామగుండం: ఆర్ఎఫ్​సీఎల్​ కంపెనీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా డబ్బులకు కక్కుర్తిపడి ఒక్కో ఉద్యోగానికి రూ.ఆరు నుంచి రూ.పదిలక్షలు వసూలు చేస్తూ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ ఆరోపించారు. ఈ మేరకు ఎన్టీపీసీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్ఎఫ్ సీఎల్ సీఈవోను వెంటనే బర్తరఫ్ చేసి సీబీఐ విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించాలని రియాజ్ డిమాండ్ చేశారు. సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు ఆకుల రామ్ కిషన్, తోట వేణు, వెల్తురు మల్లయ్య, నరసింహారావు, రాజానందం, శ్రీనివాసరెడ్డి, కాన్నురి శంకర్, మేకల రామస్వామి, బొట్ల స్వామి పాల్గొన్నారు.