![ఎంపీ సంతోష్ కు అరుదైన గిఫ్ట్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/12/07HSB15.jpg?fit=633%2C350&ssl=1)
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఎంపీలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కనాటారు. రాజ్యసభ ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేష్ రెడ్డి, పార్లమెంట్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, బోర్లకుంట్ల వెంకటేష్ నేత, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.