Breaking News

పద్మనాభం సక్సెస్ అవుతాడు..

నటుడు సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌’. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ హీరోయిన్. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రిమియర్స్ కు ప్రేక్షకుల నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ఫ్యామిలీ స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
సుహాస్ మాట్లాడుతూ.. ‘‘ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసి చాలా మంది నన్ను దీవిస్తుంటే ఆనందంతో నాకు మాట రాలేదు. రేపటి కోసం ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. శరత్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఈవెంట్ కి ఫ్యామిలీ స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ అని పేరు పెట్టాం. గత ఆరు రోజులుగా విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ కి టీం అంతా వెళ్లి అక్కడ కొందరితో కలిసి వాళ్ళన్ని థియేటర్ లోకి తెచ్చాం. మీకు సినిమా నచ్చితే మరో పది మందికి చెప్పండి. ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గించాం. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక , యుఎస్ , కెనడా, ఆస్ట్రేలియా లో విడుదలవుతోంది. అన్ని సినిమాలు మంచి విజయాలు సాధించాలి ’’ అని కోరారు. షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘‘ప్రిమియర్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. మా నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా చూసిన ప్రేక్షకులు రియాక్షన్ చూస్తుంటే ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇదే నమ్మకాన్ని విడుదల తర్వాత ప్రేక్షకులు ఇస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. టీనా శిల్పరాజ్ మాట్లాడుతూ.. ‘‘ఇది నా మొదటి సినిమా. అందరూ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అంది. చంద్రు మనోహర్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే ఆరు స్క్రీన్స్ అయ్యాయి. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.