Breaking News

సనాతన ధర్మరక్షణకు పాటుపడాలి

సనాతన ధర్మరక్షణకు పాటుపడాలి

ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ బండి వెంకటేశ్వర్లు

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, ధర్మరక్షణ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ బండి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవార్ జన్మదినాన్ని సైతం జరుపుకున్నారు. హిందూ సంఘటన ధ్యేయంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిరంతరం కృషిచేస్తుందని ఆయన అన్నారు. ప్రతిఒక్కరూ సంఘ శాఖలో నిత్యం పాల్గొనాలని సూచించారు. గ్రామాల్లో శాఖలను విస్తరించడానికి స్వయం సేవకులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, పెద్దశంకరంపేట సర్పంచ్ ఆలుగుల సత్యనారాయణ, బీజేపీ మండల అధ్యక్షుడు కోణం విఠల్, శిశుమందిర్ ప్రబంధకారిణి దాదిగారి గంగాధర్, క్రాంతిలాల్, బోడ్ల ప్రకాశం, పున్నయ్య, మాణిక్ రెడ్డి, గంగారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సంతోష్ ప్రభాకర్, ఆర్ఎస్ఎస్ బాధ్యులు జైహింద్ రెడ్డి, సీతారామారావు, వీరప్ప, రవివర్మ, కృష్ణమూర్తి, సతీశ్​గౌడ్, సర్వేశ్వర్, మధు, దుర్గాప్రసాద్, అధికసంఖ్యలో స్వయంసేవకులు ల్గొన్నారు.