Breaking News

రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష

రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష
  • ధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలి: కేకే
  • గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్​ఎంపీల నిరసన ప్రదర్శన

న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం జాతీయ పాలసీ తీసుకురావాలని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతులపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణతో రైతులకు భద్రత ఉంటుందని, తెలంగాణలో పండిన ధాన్యాన్ని తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనకు చేపట్టారు. ఈ సందర్భంగా కె.కేశవరావు మాట్లాడుతూ.. వానాకాలంలో 1.2 కోట్ల టన్నుల ధాన్యం పండిందని, 62 లక్షల ఎకరాల్లో వరి ఉందంటే కేంద్రం నమ్మడం లేదని మండిపడ్డారు. చివరికి 59 లక్షల ఎకరాల్లో వరి ఉందని కేంద్రం ఒప్పుకున్నదని గుర్తుచేశారు. కనీస మద్దతు ధరకు తక్కువగా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎన్నోసార్లు భర్తీ చేసిందన్నారు. నిరసనలో టీఆర్ఎస్​లోక్‌ సభపక్షనేత నామా నాగేశ్వర్​రావు, రాజ్యసభ సభ్యులు సురేష్‌ రెడ్డి, బండా ప్రకాశ్‌, జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, లోక్‌ సభ సభ్యులు డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేశ్​నేత తదితరులు ప్ల కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.