Breaking News

రైతుబంధుపై దుష్ప్రచారం

రైతుబంధుపై దుష్ప్రచారం
  • ఇచ్చిన హామీ మేరకు రైతులకు నగదు
  • సీఎం కేసీఆర్​చిత్రపటానికి మంత్రి గంగుల క్షీరాభిషేకం

సామాజిక సారథి, కరీంనగర్: రైతులకు ఇచ్చిన మాట తప్పని సీఎం కేసీఆర్‌ తప్పలేదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా బుధవారం కరీంనగర్‌ లోని గోపాలపూర్‌లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గి ఇబ్బంది ఏర్పడినా.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదని గుర్తుచేశారు. కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, ఉచిత కరెంట్, రైతుబంధు వంటి వాటిని నిరంతరాయంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది వడ్లు వేసేవాళ్లకు రైతుబంధు రాదనే తప్పుడు ప్రచారాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో గతంలో మాదిరిగానే ప్రతిఒక్కరికి రైతుబంధును అందజేస్తుందని తెలిపారు. మరోవైపు ఈ యాసంగిలో రైతులు ఇష్టమైన పంట వేసుకోవడానికి అనుమతి ఉందని తెలిపారు. అయితే యాసంగిలో కేంద్రం వరి వేయొద్దని, కొనమని చెప్పడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. మిల్లర్లతో అగ్రిమెంట్లు ఉన్నవాళ్లు సొంత ఏర్పాట్లతో వేసుకోవాలని సూచించారు.