Breaking News

ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డికి విషెస్​ చెప్పిన మంత్రి హరీశ్​రావు

ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డికి మంత్రి శుభాకాంక్షలు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: మహబూబ్​నగర్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా కూచకుళ్ల దామోదర్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తన తనయుడు డాక్టర్ ​కూచకుళ్ల రాజేశ్​రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్​రావును హైదరాబాద్ లో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన దామోదర్ రెడ్డికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విజయం కోసం పనిచేసిన ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లా టీఆర్ఎస్ ​ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల కృషిని కొనియాడారు. వారికి అభినందనలు తెలియజేశారు.