![మల్లన్న సన్నిదిలో మంత్రి, ఎమ్మెల్యే](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2022/01/15HSB3.jpg?fit=495%2C300&ssl=1)
సామాజిక సారథి, ఐనవోలు: హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకొని స్వామి వారిని మంత్రి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు మేయర్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నాగేశ్వర్, అర్చుకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనలు అందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే అరూరి రమేష్ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు