Breaking News

డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం

డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం

సామాజిక సారథి, కల్వకుర్తి:  నాగర్ కర్నూల్ జిల్లా  కల్వకుర్తి నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి వర్యులు  సబితా ఇంద్రారెడ్డి తో కలిసి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ జీబీ తీగల అనితా హరినాథ్ రెడ్డి  కడ్తాల్ బాలుర పాఠశాల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించారు. అదే విధంగా కడ్తాల్ లో  పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయానికి శంకుస్థాపన,  వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, రైతు వేదిక ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్  ఎంపీ రాములు, స్థానిక జెడ్పీటీసీ దశరథ్ నాయక్, అమన్గల్  జెడ్పీటీసీ అనురాధ పత్యా నాయక్, స్థానిక సర్పంచ్ లక్ష్మీనరసింహ రెడ్డి , ఎంపీటీసీలు,టీఆర్ఎస్  కార్యకర్తలు,తదితరులు  పాల్గొన్నారు