Breaking News

ఎమ్మెల్సీ సంబరాల్లో తుపాకీ కలకలం

ఎమ్మెల్సీ సంబరాల్లో తుపాకీ కలకలం

హైదరాబాద్​: నల్లగొండ, హైదరాబాద్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్​రెడ్డి, సురభి వాణీదేవి ​ఘనవిజయం సాధించారు. టీఆర్ఎస్ ​శ్రేణుల సంబరాల్లో భాగంగా బాణాసంచా కాల్చడంతో తెలంగాణ భవన్ ​కప్పుకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం టీఆర్ఎస్ ​నేత ఒకరు తుపాకీతో హల్​చల్​ సృష్టించాడు. ఆ పార్టీలో యూత్​వింగ్ ​లీడర్​ కట్టెల శ్రీనివాస్ ఒక్కసారిగా తుపాకీ తీసి పైకి ఎత్తిపట్టడంతో సమీపంలోని కార్యకర్తలు, నాయకులు హతాశులయ్యారు. వెంటనే తుపాకీని దాచిపెట్టాడు. ఈ పరిణామంతో తెలంగాణ భవన్ వద్ద నిత్యం అలర్ట్​గా ఉండే పోలీసులు ఏమయ్యారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన స్వయానా మాజీ ఎమ్మెల్సీ మేరి రవీంద్రనాథ్​ అల్లుడు. ఎన్నికల కోడ్​ సమయంలో తుపాకీని బయటికి తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.