Breaking News

సర్కారు సాయం

సర్కారు సాయం
  • నేటినుంచి రైతుబంధు నిధులు విడుదల
  • యాసంగి పెట్టుబడి కోసం ఖాతాల్లో జమ
  • 66.61 లక్షల మంది రైతులకు రూ.7,645.66 కోట్లు 

సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రైతుబంధు సొమ్మును ఈనెల 28వ తేదీ నుంచి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. యాసంగి పంట పెట్టుబడులకు సంబంధించి నిధులు పంపిణీ చేయనుంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏడు విడతల్లో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమచేశారు. ఈ సీజన్‌ తో కలుపుకుని మొత్తం రూ.50వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఇక డిసెంబర్‌ 10వ తేదీ నాటికి ధరణి పోర్టల్‌ లో పట్టాదారులు, కమిషనర్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ద్వారా అందిన ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులు.. ఈసారి రైతుబంధు పొందేందుకు అర్హులు కానున్నారు. ఈ సీజన్‌లో ప్రభుత్వం 66.61 లక్షల మంది రైతులకు గాను సుమారు 152.91 లక్షల ఎకరాలకు రూ.7645.66 కోట్లు జమ చేయనుంది. కాగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులకు పెట్టుబడి సాయంగా సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ కూడా ఈ తరహా పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.