Breaking News

జీహెచ్​ఎంసీ మేయర్​గా గద్వాల విజయలక్ష్మి

జీహెచ్​ఎంసీ మేయర్​గా గద్వాల విజయలక్ష్మి

  • డిప్యూటీ మేయర్​గా మోతే శ్రీలతరెడ్డి ఎన్నిక
  • నూతన పాలకవర్గాన్నిఅభినందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్​మేయర్ గా టీఆర్ఎస్​నుంచి గెలుపొందిన బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా తార్నాక టీఆర్ఎస్ కార్పొరేటర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి చేతులమీదుగా ధ్రువీకరణపత్రాలను గురువారం అందుకున్నారు. వారిని డిప్యూటీ స్పీకర్​ తిగుళ్ల పద్మారావుగౌడ్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.