Breaking News

కొడుకు, కోడలు వేధింపులకు తండ్రి ఆత్మహత్య

కొడుకు, కోడలు వేధింపులకు తండ్రి ఆత్మహత్య

సారథి, రామాయంపేట: భూమి కోసం భార్యతో కలిసి కొడుకు వేధించడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం మెదక్​జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామంలో వెలుగుచూసింది. నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ కథనం.. గ్రామానికి చెందిన కట్ట నర్సయ్య(65) తన పేరున ఉన్న 2.10 ఎకరాల భూమిలో పెద్దకొడుకు నర్సింలు భార్య సంపూర్ణపై 20 గుంటల భూమిని పట్టా చేయించుకున్నాడు. ఈ క్రమంలో చిన్నకొడుకు శ్రీనివాస్ తన తండ్రిని నమ్మించి తన భార్య పేరు మీద 1.28 ఎకరాల భూమిని పట్టా చేయించుకున్నాడు. అప్పటినుంచి పెద్దకొడుకు, పెద్దకోడలు వేధింపులు గురిచేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన నర్సయ్య పొలం గట్టున ఉన్న టేకు చెట్టుకు దోతీతో ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య రామవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రకాష్​గౌడ్​తెలిపారు.