Breaking News

రైతులకు అండగా రైతు సహాయ వేదిక

రైతులకు అండగా రైతు సహాయ వేదిక

సారథి, రామాయంపేట: విద్యుత్ తీగల స్తంభాల మధ్య దూరం తగ్గించి పంట పొలాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని రైతు సహాయ వేదిక మెదక్ జిల్లా ప్రతినిధులు డి వెంకటేశం, ఎ.రవీందర్ సంబంధిత శాఖ అధికారులను కోరారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బత్తుల బాబు అనే రైతు ఎకరా పొలంలో వరి పంట సాగుచేశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో అరెకరా పొలం అగ్నికి ఆహుతైంది. ఈ విషయం తెలుసుకున్న రైతు సహాయ వేదిక గ్రూప్ తరపున రూ.నాలుగువేలను సదరు రైతుకు సోమవారం నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీష్ చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో రైతు సహాయ వేదిక మండల ప్రతినిధి వొజ్జ రాజయ్య, బత్తుల బాబు పాల్గొన్నారు.