సారథి న్యూస్, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో శివరాత్రిని పురస్కరించుకుని మూడురోజులుగా స్థానిక భజన బృందం కళాకారులు ఆడిన పార్వతి కల్యాణం పౌరాణిక నాటకం అలరించింది. ప్రేక్షకులు జేజేలు పలికారు. హైటెక్యుగంలోనూ కళలను బతికిస్తున్న కళాబృందాన్ని పలువురు అభినందించారు. జానపద, పౌరాణిక నాటకరంగ ఇతివృత్తం, సారాంశాన్ని నేటి తరానికి అందించాలని కోరారు. కళ ప్రజల కోసం, మంచి కోసం ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల్లో చైతన్యం నింపాలని సూచించారు. నాటకంలో తారాకాసురుడిగా కొప్పు వెంకటయ్య, నారద మహర్షిగా మొగులయ్య, శంకరుడిగా బాల్రాం, పార్వతిదేవిగా బి.నర్సింహా, మహావిష్ణువుగా బాలపెంటయ్య, స్వాతిదేవిగా టి.వెంకటయ్య, కుమారస్వామిగా ఎ.బాలస్వామిగా.. ఇలా ఎవరికివారు పలు పాత్రల్లో ఒదిగిపోయి నాటకాన్ని రక్తికట్టించారు. తన తండ్రి స్మారకార్థం, తన కూతురుకు మెడిసిన్లో సీటు వచ్చిన సందర్భంగా టీచర్ కొప్పు వెంకటయ్య రూ.1,1160 విరాళంగా కళాకారులకు అందజేశారు. సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్రావు, వార్డు సభ్యుడు హరిశ్చంద్రప్రసాద్, డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కళాకారులను అభినందించారు.
- March 8, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- NAGARKURNOOL
- PARVATHI KALYANAM
- SHIVARATHRI
- నాగర్కర్నూల్
- పార్వతి కల్యాణం
- వెల్దండ
- శివరాత్రి
- Comments Off on అలరించిన పార్వతి కల్యాణం నాటకం