Breaking News

పేదల పక్షాన కాంగ్రెస్ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది….. ములుగు ఎమ్మెల్యే సీతక్క

సామాజిక సారధి , బిజినేపల్లి: దేశంలోనే పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు . బుధవారం మండల పరిధిలోని గుడ్ల నర్వ గ్రామంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొణిదల రాము ఇంటికి వారు వచ్చారు . సీతక్క రావడంతో గ్రామంలో ఉన్న పేదలంతా ఒక దగ్గరికి చేరుకొని ఆమెను చూసేందుకు ఆశతో చాలామంది తహతహ పడ్డారు . కార్యకర్త ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి హైదరాబాద్ కువెళ్ళిపోతున్నట్లు వారు తెలిపారు .

తెలంగాణ రాష్ట్రంలోని మహిళలో బ్రాండ్ అంబాసిడర్ గా నిజాయితీగల కార్యకర్తగా పేరు తెచ్చుకున్న సీతక్కను చూసి చాలామంది సంతోషపడ్డారు . ఆమెతో ఫోటోలు దిగనికే గ్రామంలోని యువకులు బారులు తీరారు . వారి వెంట మాజీ సర్పంచ్ దేవరకొండ రామచందర్ , యువజన కాంగ్రెస్ నేతలు ఉన్నారు .