![కేసులు రాజీపడేల కౌన్సిలింగ్ ఇవ్వాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/12/07HSB4-1.jpg?fit=350%2C525&ssl=1)
సామాజిక సారథి, మెదక్ ప్రతినిధి: జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడే కేసులలో రాజీపడేటట్లు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఐపీఎస్ చందన దీప్తి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈనెల 11న జాతీయ లోక్ అదాలత్ ఉన్నందున రాజీపడే అవకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలన్నారు. లిస్ట్ అవుట్ చేసిన కేసులలో అన్ని కేసులు రాజీ పడేటట్లు ప్రతి కోర్టు లైజనింగ్ ఆఫీసర్స్, కోర్ట్ కానిస్టేబుళ్లు, సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. కోర్టు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి కేసులలో రాజీ శాతం పెంచాలని సూచించారు.