Breaking News

రేషన్ పద్ధతిలో మద్యం

రేషన్ పద్ధతిలో మద్యం

సామాజిక సారథి, తిమ్మాజీపేట: నూతన ఎక్సైజ్ సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం కావడంతో ఇటీవల లక్కీ డిప్ ద్వారా ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలను దక్కించుకున్న యజమానులు మద్యం కోసం మండల కేంద్రంలోనీ టీఎస్పీసీఎల్ స్టాక్ పాయింట్ కు తరలి వచ్చారు. మొదటి రోజు 30 దుకాణాల యజమానులు లిక్కర్ బీరు తీసుకువెళ్లడానికి ఉమ్మడి జిల్లాల నుంచి దుకాణాల యజమానులు తరలివచ్చారు. తొలిరోజు రేషన్ పద్ధతిలో మద్యం అందించారు. అన్ని దుకాణాలకు మద్యం అందించాలన్న అధికారుల ఆదేశాల మేరకు 100 కాటన్లు  లిక్కర్ రెండు వందల బీర్లు ఇచ్చారు. మంగళవారం బుధవారం కూడా ఇదే పద్ధతిలో అందించనున్నట్లు డీఎం లచ్చయ్య తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మొదట మద్యం ఇస్తున్నట్లు తెలిపారు. తొలి రోజు కావడంతో స్టాక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. రాత్రి వరకూ మద్యం అమ్మకాలు కొనసాగాయి.