Breaking News

57వేలకు చేరువలో కరోనా మరణాలు

57వేలకు చేరువలో కరోనా మరణాలు

ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్ ​కేసులు నమోదవుతున్నాయి. అదేస్థాయిలో మరణాలు కూడా రికార్డు అవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 30,44,940కు చేరింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 912 మంది చనిపోయారు. ఇప్పటిదాకా దేశంలో కరోనా మరణాల సంఖ్య 57వేలకు చేరింది. మరో ఏడు లక్షల యాక్టివ్ ​కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 69,239 పాజిటివ్ ​కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 22,080 మంది కోలుకున్నారు. అయితే కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాజాగా 58వేల మంది మహమ్మారి బారినపడి కోలుకున్నారని కేంద్ర వైద్యారోగ్యశాఖ తన రిపోర్ట్​లో వెల్లడించింది.

దేశంలో కరోనా వ్యాధి బాధితుల రికవరీ రేటు 74.69శాతానికి చేరింది. మరణాల రేటు1.87శాతంగా ఉంది. అలాగే భారత్​లో కోవిడ్​19 నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లోనే 8లక్షల శాంపిళ్లను టెస్టు చేసినట్లు భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇప్పటివరకు 3.52 కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్లు స్పష్టంచేసింది.