![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/CARONAA-DELHIIIFF.jpg?fit=700%2C394&ssl=1)
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తున్నది. గత 24 గంటల్లో 78,357 కొత్తకేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య సంఖ్య 37,69,524 కు చేరింది. తాజాగా 1,045 మందిని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకున్నది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 66,333 కుచేరుకున్నది. ఇప్పటివరకు 29,01,909 మంది కొలుకున్నారని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 8,01,282 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉందని తెలిపింది. అలాగే మరణాల రేటు 1.76 శాతంగా ఉందని వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.43 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి ప్రకటించింది. ప్రజలు కరోనాను తేలికగా తీసుకొవద్దని అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.