Breaking News

32 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్నది. కొత్తకేసులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 32 వేల కొత్తకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్​లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే టెస్టులు సరిగ్గా చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు భారత్​లో 9,68,876 కేసులు నమోదయ్యాయి. 6,12,814 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 24, 915 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,31,146 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

భారత్​ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో లాక్​డౌన్​ కష్టసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రజలు స్వీయనిబంధనలు పాటించాలని వారు కోరుతున్నారు. కేసులు మరింత పెరిగితే మనకున్న వైద్యసిబ్బంది, వసతులు సరిపోకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అనుమానితులను ట్రేస్​ చేయడం, టెస్టులు చేయడం, వారికి ట్రీట్​మెంట్ చేయడం టీటీటీ విధానం ద్వారా కరోనాను అరికట్టవచ్చని వారు సూచిస్తున్నారు.