Breaking News

26న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం

26న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం

సారథి న్యూస్, వనపర్తి: నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.విజయ రాములు, ఏఐటీయూసీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మాసన్న, పార్టీ సీనియర్ నాయకుడు డి.చంద్రయ్య పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సీపీఐ ఆఫీసులో శనివారం ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిరంకుశ ధోరణి అనుసరిస్తూ హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. హక్కులను కాపాడుకునేందుకు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఖాజాపాషా, బాలస్వామి, రషీద్, ముకుందా, రమేష్, నరసింహులు, శోభారాణి, పద్మ, శాంతన్న, భాస్కర్, గోపాల్ గౌడ్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.