Breaking News

2,579 కేసులు.. 9 మరణాలు

2,579 కేసులు.. 9 మరణాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో మంగళవారం(24 గంటల్లో) 2,579 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా, రాష్ట్రంలో తాజాగా 9 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 770 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,08,670గా నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్​కేసులు 23,737 ఉన్నాయి. తాజాగా 1,752 మంది వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ఇలా ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 84,163కు చేరింది. అత్యధికంగా హైదరాబాద్​పరిధిలో 295 కేసులు నమోదు నమోదయ్యాయి.

తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్​


జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​34, భద్రాద్రి కొత్తగూడెం 83, జగిత్యాల 98, జనగామ 46, జోగుళాంబ గద్వాల 47, కామారెడ్డి 64, కరీంనగర్​116, ఖమ్మం 161, మహబూబ్​నగర్​69, మహబూబాబాద్ 81, మంచిర్యాల 104, మెదక్​42, మల్కాజిగిరి 106, నాగర్​కర్నూల్​48, నల్లగొండ 129, నిర్మల్​28, నిజామాబాద్​142, పెద్దపల్లి 85, రాజన్నసిరిసిల్ల 59, రంగారెడ్డి 186, సిద్దిపేట 92, సూర్యాపేట 78, వికారాబాద్​23, వనపర్తి 56, వరంగల్​అర్బన్​ 143, వరంగల్​ రూరల్​31, యాదాద్రి భువనగిరి 46 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.