Breaking News

25 నుంచి ఆరో విడత హరితహారం

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఈనెల 25 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు హరితహారం కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఆఫీసులో ఆరో విడత హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్​యాదవ్​, మల్లారెడ్డి, మేయర్​ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, మున్సిపల్​శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్, కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.