![20 – 25 మంది ఎమ్మెల్యేలతో ఏం చేస్తావ్?](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/KAPIL-2F.jpg?fit=650%2C383&ssl=1)
న్యూఢిల్లీ: సొంత పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్పై కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ లాయర్ కపిల్ సిబల్ ఫైర్ అయ్యారు. 20 – 25 మంది ఎమ్మెల్యేలతోనే సీఎం అయిపోతావా? అంటూ ప్రశ్నించారు. పార్టీని పబ్లిక్ ముందు తమాషా చేయొద్దన్నారు. ‘సచిన్ నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు సీఎం అవ్వాలని అనుకుంటున్నవా? మాకు చెప్పు. ఈ తిరుగుబాటు ఎందుకు? బీజేపీతో కలవను అని చెబుతున్న నీవు హర్యానాలో ఎందుకు ఉన్నావు. పార్టీ సమావేశాలకు ఎందుకు రాననుంటున్నావు. సొంత పార్టీ పెట్టాలనుకుంటున్నావా? మరి బయటికి వచ్చి మాట్లాడు’ అని కపిల్సిబల్ ప్రశ్నించారు. సొంత పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్ తన తరఫు ఎమ్మెల్యేలతో హర్యానాలోని ఉంటున్నారు. కాంగ్రెస్ వారికి నోటీసులు ఇవ్వడంతో కోర్టుకు వెళ్లగా సచిన్ వర్గానికి కోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ తరఫున కేసును కపిల్ సిబల్ వాదిస్తున్నారు.