- ఏఐకేఎస్సీసీ పిలుపు
సారథి న్యూస్, హైదరాబాద్: అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్సీసీ) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో అక్టోబర్ 14న కనీస మద్దతు ధరల హక్కుదినాన్ని జరపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రాష్ట్రంలోని భాగస్వామ్య సంఘాలతో పాటు రైతు మద్దతుదారులంతా భాగస్వాములు కావాలని టి.సాగర్, పశ్య పద్మ, రాయల చంద్రశేఖర్, పల్లపు ఉపేందర్రెడ్డి, అచ్యుత రామారావు, కన్నెగంటి రవి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు రైతులు పెట్టిన పెట్టుబడికి 50శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయించేలా చట్టం చేయాలని డిమాండ్చేశారు. కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులు తమ పొలాల్లోనే కూలీలుగా మారే ప్రమాదం ఉందన్నారు.