![11 మంది మృతి.. 2,083 కరోనా కేసులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/ts-2f.jpg?fit=615%2C402&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో(శనివారం) 2,083 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 64,786 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 11 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 530కు చేరింది. ప్రస్తుతం 17, 754 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ అయిన కేసుల సంఖ్య 1,114 గా నమోదైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 578 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి 228, వరంగల్ అర్బన్ 134, మేడ్చల్ 197, కరీంనగర్ 108, సంగారెడ్డి 101, భద్రాద్రి కొత్తగూడెం 35, జగిత్యాల 21, జనగాం 21, జోగుళాంబ గద్వాల 35, ఖమ్మం 32, మహబూబ్నగర్ 31, మహబూబాబాద్40, మంచిర్యాల 37, నల్లగొండ 48, నిర్మల్25, నిజామాబాద్73, పెద్దపల్లి 42, రాజన్నసిరిసిల్ల 39 చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మీడియా బులెటిన్ను విడుదల చేసింది.