Breaking News

100 ఏళ్ల క్రికెటర్​.. ఇక లేరు

ముంబై: భారత క్రికెట్​లో కురువృద్ధుడు వసంత్​ రాయిజీ (100) పరమపదించారు. వయోధిక భారంతో వచ్చే సమస్యలతోనే ఆయన తుదిశ్వాస విడిచారు. 1940లో తొమ్మిది ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​ మ్యాచ్​లు ఆడిన రాయిజీ.. 277 పరుగులు సాధించాడు. ఇందులో అత్యధిక స్కోరు 68 పరుగులు. 1933లో టీమిండియా తొలి టెస్ట్​ ఆడినప్పుడు రాయిజీ వయసు 13 ఏళ్లు. అప్పట్నించి.. ఇప్పటివరకు భారత క్రికెట్​ ప్రయాణాన్ని పూర్తిస్థాయిలో చూశాడు. 1939లో క్రికెట్​ క్లబ్​ ఆఫ్​ ఇండియా (సీసీఐ) తరఫున ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​లోకి అరంగేట్రం చేసిన రాయిజీ.. సెంట్రల్​ ప్రావిన్సెస్​, బేరార్​ జట్లపై ఆడాడు. 1941లో బాంబేకు ఆడిన రాయిజీ.. బరోడా తరఫున రంజీల్లో బరిలోకి దిగాడు. రాయిజీ మృతికి.. క్రికెటర్లతో పాటు బీసీసీఐ, సీసీఏ తమ సంతాపాన్ని ప్రకటించారు.