![హైదరాబాద్ బెస్ట్ మెగాసిటీ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/GHMC-2FF.jpg?fit=677%2C354&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షన్- 2020 అవార్డులను కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) బెస్ట్ మెగాసిటీగా ప్రథమస్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ఇక పరిశుభ్రమైన నగరంగా దేశంలోనే ఇండోర్ పట్టణం తొలిస్థానంలో నిలవగా గ్రేటర్ హైదరాబాద్ 23వ స్థానంలో నిలిచింది. గతేడాది హైదరాబాద్ 35 స్థానంలో నిలవగా, ఇప్పుడు ముంబై, బెంగళూర్ నగరాలను దాటి హైదరాబాద్ మెరుగైన స్థానాన్ని సంపాదించింది. 40లక్షల జనాభా ఉన్న నగరంలో నిర్వహించిన సిటిజన్స్ ఫీడ్ బ్యాంక్ కేటగిరీలో గ్రేటర్ హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపారు.