Breaking News

హామీల అమలులో విఫలం

హామీల అమలులో విఫలం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన యువకులతో పాటు, చేగుంట మండలం పొలంపల్లి గ్రామ యువకులు కలిసి మొత్తం 50 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, నల్లాల విజయ్, ఉపాధ్యక్షుడు దత్తు ప్రకాష్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, బీజేవైఎం మండలాధ్యక్షుడు మహేష్, మండల ప్రధాన కార్యదర్శి దశరథ్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ పాల్గొన్నారు.