![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/carona-test-bjpff.jpg?fit=275%2C183&ssl=1)
చండీగఢ్: హర్యానాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సుధాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. సుభాష్ కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన కొంతకాలంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తెలిందని ఆయన వ్యక్తిగత సహాయకుడు అరుణ్ గులాటి మీడియాకు తెలిపారు. జూన్ 21న సంభవించిన సూర్యగ్రహణం రోజున నిర్వహించిన ఓ పూజలో ఆయన పాల్గొన్నట్టు సమాచారం. ఆ పూజకు 200 మందిదాకా హజరయ్యారు. ప్రస్తుతం వారందరికి భయం పట్టకున్నది.