Breaking News

హర్యానా ఎమ్మెల్యేకు కరోనా

చండీగఢ్‌: హర్యానాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ ‌సుధాకు కరోనా పాజిటివ్​ అని తెలిసింది. సుభాష్​ కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్​కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన కొంతకాలంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్​ దవాఖానకు తీసుకెళ్లి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్​ అని తెలిందని ఆయన వ్యక్తిగత సహాయకుడు అరుణ్​ గులాటి మీడియాకు తెలిపారు. జూన్ 21న సంభ‌వించిన సూర్యగ్రహణం రోజున నిర్వహించిన ఓ పూజలో ఆయన పాల్గొన్నట్టు సమాచారం. ఆ పూజకు 200 మందిదాకా హజరయ్యారు. ప్రస్తుతం వారందరికి భయం పట్టకున్నది.