Breaking News

హథ్రాస్​ నిందితులను ఉరి తీయాలి

సారథి న్యూస్, రామడుగు: మనీషా వాల్మికిపై లైంగికదాడి జరిపిన నిందితులను వెంటనే ఉరితీయాలని ఎమ్మార్పీఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు. ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లోని హత్రాస్​ జిల్లాలో మనీషా పై నలుగురు దుండగులు లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని స్థానిక అంబేద్కర్​ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్​ నాయకులు మనీష చిత్రపటంతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్​ మండల అధ్యక్షుడు తడగొండ శంకర్ మాట్లాడుతూ.. హథ్రాస్​ ఘటనపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేణిగుంట పిరాజ్, శనిగారపు హనుమయ్య, తడగొండ రాజు, కొత్తూరు బాబు, కర్ణాకర్, ప్రభాకర్ పౌల్, వెంకటేశ్​, సాయి బాగన్, సోను, మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు.