![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/EXAM.jpg?fit=894%2C497&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు శనివారం రిలీజ్ చేశారు. జులై 1న పాలీసెట్, జులై 1 నుంచి 3వ తేదీ వరకు పీజీ సెట్, 4న తెలంగాణ ఈసెట్, 6 నుంచి 9 వరకు ఎంసెట్, 10న లాసెట్, పీజీ సెట్, 13న ఐసెట్, 15న ఎడ్సెట్ నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు, ఆదేశాల ప్రకారం పరీక్షల నిర్వహణకు అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షలకు చాలా సమయం ఉన్నందున విద్యార్థులు సన్నద్ధం కావాలని సూచించారు. గతంలోనే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ షెడ్యూల్ను రద్దు చేశారు. మళ్లీ తాజాగా మరోసారి ఖరారుచేశారు.