Breaking News

సుశాంత్​ కేసులో మరో ట్విస్ట్​

సుశాంత్​ కేసులో మరో ట్విస్ట్​

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా సుశాంత్​ సింగ్​ బ్యాంక్​​ఖాతాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్‌ ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిహార్ పోలీసుల నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్ ఖాతానుంచి సుమారు 15 కోట్ల రూపాయలను నటి రియా చక్రవర్తి వాడుకుందని సుశాంత్‌ తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకున్నది.