Breaking News

సుజాతక్క, మేం ప్రజల వైపే ఉంటాం

సుజాతక్క, మేం ప్రజల వైపే ఉంటాం

సారథి న్యూస్, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని రెడ్డి సంఘం భవన్ లో గురువారం ఆటో యూనియన్ ఏర్పాటుచేసిన సంఘీభావ సభలో మంత్రి టి.హరీశ్​రావు మాట్లాడారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడం బాధాకరన్నారు. తెలంగాణ మొత్తం ఇప్పుడు దుబ్బాక వైపు చూస్తోందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తాను, కాబోయే ఎమ్మెల్యే సుజాతక్క ప్రజల వైపే ఉంటామన్నారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడడం పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్ రెడ్డికి తగదన్నారు. భేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. రేపు దుబ్బాకలో ఉత్తమ్​కుమార్ రెడ్డి మహిళలకు సమాధానం చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీకి మహిళలు, దుబ్బాక ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీరు అందజేసిన ఘనత సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికే దక్కిందన్నారు.