Breaking News

సీ అండ్ వెయిట్

కథలు, షూటింగ్​ల విషయంలో కానీ రాజమౌళి చాలా గుట్టుగా ఉండటారన్న విషయం తెలిసిందే. తను నిర్మిస్తున్న సినిమా గురించి ఏదైనా అప్​డేట్​ ఇవ్వాలంటే అన్నీ సవ్యంగా సమకూరితేగాని ఆ సినిమా ముచ్చట సోషల్ మీడియాలో కాదు గదా మీడియా మిత్రులకు ఎలాంటి ఇవ్వని జక్కన తాజా శ్రియ శరణ్ తాజాగా ఒక సోషల్ మీడియా లైవ్ చాట్​లో పాల్గొనడం.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి డిటెయిల్స్ ఇవ్వడం.. విషయాలు తెలిసిన వీపరీతమైన ఆగ్రహానికి గురయ్యాడట. రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ కాని ఇప్పటికొచ్చి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. కానీ ఓ కీలకపాత్ర చేస్తున్న అజయ్ దేవగణ్ భార్యగా తాను ఫ్లాష్​బ్యాక్​ ఎపిసోడ్​లో కనిపిస్తానని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఓ చిన్న లీడ్ కూడా దొరకకుండా ఉన్నందున మీడియా మిత్రులు ఈ న్యూస్​తో ఖుషీ అయిపోతూ ఎవరికి తోచినట్టు వాళ్లు కథలు అల్లేసుకుంటున్నారు. ఇది డైరెక్టర్ రాజమౌళికి ఒకింత ఇబ్బందిగా తయారయ్యింది. దాంతో శ్రియాపై చిందులు స్టార్ట్ చేసాడంట. శ్రియా వ్యవహారంపై సీరియస్ అయిన జక్కన్న ఏదైనా షాకింగ్​ డెసిషన్​ తీసుకుంటాడా? లేదా వార్నింగ్​తో సరిపెడతాడా ?అని చూడడం ఇప్పుడు అందరి వంతు అయింది.