Breaking News

సీరియల్​ నటి ఆత్మహత్య

సీరియల్​ నటి ఆత్మహత్య

అప్పులబాధ భరించలేక ఓ సీరియల్ నటి, గాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి కొంతకాలం టీవీ సీరియల్స్​ నటించింది. తర్వాత అవకాశాలు తగ్గడంతో గుంటూరుకు వెళ్లింది. అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్య అనే రియల్​ఎస్టేట్​ వ్యాపారిని వివాహం చేసుకున్నారు. గుంటూర్​ విద్యానగర్​లో ఉంటున్న రేఖ పెళ్లి వేడుకల్లో పాటలు పాడటం, యాంకరింగ్ వంటివి చేసేవారు. కాగా కొంతకాలంగా ఆమెకు అవకాశాలు రావడం లేదు. మరోవైపు భర్తకు కూడా రియల్​ఎస్టేట్​లో నష్టాలు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన రేఖ గురువారం ఉదయం బాత్​రూమ్​లో ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.