Breaking News

సీఎం కేసీఆర్​ రైతు పక్షపాతి

సారథి న్యూస్, చొప్పదండి: కరోనా సంక్షోభంతో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతున్నా.. రైతులకు రైతుబంధు డబ్బులను ఇచ్చిన ధీశాలి కేసీఆర్​ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ కొనియాడారు. ప్రతిరైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్​ లక్ష్యమని చెప్పారు. కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని వరలక్ష్మి పంక్షన్​హాల్​లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకోసం నిర్మించనున్న కల్లాల నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. కల్లాల నిర్మాణాల కోసం రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయా చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, నాయకులు,అధికారులు పాల్గొన్నారు.